కూతురి కోసం రూ. 149 కోట్ల ఇంటిని బాగుచేసిన ప్రియాంక జోడీ!
on Jan 25, 2022
ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ జీవితాల్లోకి కొత్తగా ఒక పాప వచ్చింది. సరోగసీ ద్వారా ఒక పాపను కన్నట్లు ఒక జాయింట్ స్టేట్మెంట్ ద్వారా వారు ధ్రువీకరించారు. "సరొగేట్ ద్వారా ఒక బేబీకి మేం స్వాగతం చెప్పామని ధ్రువీకరించడానికి మేమంతగానో సంతోషిస్తున్నాం. మా ఫ్యామిలీపై దృష్టి పెట్టనున్న ఈ స్పెషల్ టైమ్లో మాకు ప్రైవసీ కల్పించాల్సిందిగా మిమ్మల్ని గౌరవంగా అడుగుతున్నాం" అని ఇన్స్టాగ్రామ్ ద్వారా వారు ప్రకటించారు.
ఇప్పుడు తాము కొన్న లాస్ ఏంజెల్స్ ఇంటిని తమ బేబీని దృష్టిలో ఉంచుకొనే ప్రియాంక, నిక్ కొన్నారనే విషయం బయటపడింది. 2019 ఆగస్టులో, ఆ తర్వాత నవంబర్లో ఒక కొత్త ఇంటికోసం అన్వేషించిన వారు, చివరకు లాస్ ఏంజెల్స్లోని ఎన్సినో ఎస్టేట్ కోసం 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 149 కోట్లు) ఖర్చు పెట్టారు. తమ పిల్లల్ని దృష్టిలో ఉంచుకొనే వారు ఆ ఇంటిని కొన్నారని పీపుల్ మేగజైన్ తెలిపింది.
Also read: రూ. 150 కోట్లు ఖర్చుపెట్టి 'బాహుబలి'ని చెత్తబుట్టలో పడేశారు!
"పిల్లల్ని మైండ్లో పెట్టుకొనే వారు ఆ ఇంటిని కొన్నారు. పిల్లల్ని కనాలనుకున్న వారు, ఎక్కువ ఖాళీ స్థలం, పచ్చిక ఉన్న ఇంటిని కొనాలనుకున్నారు" అని ఆ మేగజైన్ రాసింది. ఆ ఇంట్లోకి అడుగుపెట్టడానికి ముందు వారు దానికి పలు మార్పులు చేర్పులు చేశారు. 'ఫ్యామిలీ-ఫ్రెండ్లీ'గా ఆ ఇంటిని తయారుచెయ్యాలని వారనుకున్నారు.
Also read: న్యూ ఇయర్ హాలిడేస్ ఎంజాయ్ చేసొచ్చి.. ప్రియుడితో ముంబైలో ప్రత్యక్షమైన రకుల్!
కాగా తమ పాప ఫొటోను, ఆమె పేరును ప్రియాంక, నిక్ ఇంకా బయటపెట్టలేదు. మొత్తానికి కూతుర్ని కన్నందుకు ఫ్యాన్స్ మాత్రం ఆ జంటపై తమ ప్రేమాభిమానాలను వర్షంలా కురిపిస్తున్నారు.
Also Read